Jagan: ఈ అంశంపై కూడా జగన్ తో పాఠాలు చెప్పించుకోవాల్సి వచ్చింది... ఇదంతా మా దౌర్భాగ్యం: అచ్చెన్నాయుడు

  • గోదావరి గురించి మాకు తెలియదన్నట్టుగా సీఎం మాట్లాడారు
  • దీని గురించి మాకు వివరించాల్సిన అవసరం లేదు
  • మాట్లాడేందుకు కూడా సమయం ఇవ్వడం లేదు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సాగునీటి ప్రాజెక్టుల అంశంపై జగన్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అనంతరం టీడీపీ సభ్యుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇరిగేషన్ గురించి జగన్ తో చెప్పించుకోవాల్సి వచ్చిందని... ఇది తమ దౌర్భాగ్యమని అన్నారు. గోదావరి గురించి తమకు తెలియనట్టు, దానికి మూడు పాయలు ఉన్నట్టు వివరించారని... నీరు ఇలా వస్తుంది, అలా వస్తుంది అని తమకు వివరించాల్సిన అవసరం లేదని అన్నారు. తన ప్రసంగాన్ని అచ్చెన్నాయుడు కొనసాగిస్తుండగానే... సమయం అయిపోయింది, కూర్చోవాలని స్పీకర్ కోరారు. దీంతో, తమకు మాట్లాడేందుకు సమయం కూడా ఇవ్వడం లేదని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News