sandeep Kishan: నా సినిమాను కొంతమంది ఆపాలని చూశారు: హీరో సందీప్ కిషన్

  • ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాము
  •  అందరికీ డబ్బులు ఇచ్చేశాము
  •  ఈ సారి హిట్ కొడతానన్న సందీప్ కిషన్

సందీప్ కిషన్ హీరోగా 'నిను వీడని నీడను నేనే' అనే సినిమా నిర్మితమైంది. ఈ సినిమా నిర్మాతలలో ఒకరుగా సందీప్ కిషన్ వ్యవహరించాడు. రేపు ఈ సినిమా భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. ఎవరికీ ఒక్క పైసా కూడా పెండింగ్ లో పెట్టలేదు.

రోజుకి 150 మందికి భోజనాలు పెడుతూ, ఒక కుటుంబ వాతావరణంలో ఈ సినిమా షూటింగును పూర్తిచేశాము. ఎంతో నిజాయతీగా మేము ఈ సినిమాను తీస్తే, విడుదల ఆపడానికి కొంతమంది ప్రయత్నాలు చేయడం బాధాకరం. మా నిజాయితీయే ఈ సినిమాను విడుదల దిశగా నడిపించింది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుంది .. నా కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమా అవుతుందనే నమ్మకం వుంది" అని అన్నాడు

More Telugu News