India: టీమిండియా ఓటమిపై మోదీ వ్యాఖ్యలు

  • కివీస్ చేతిలో కోహ్లీ సేన ఓటమి
  • గెలుపోటములు సహజం అన్న ప్రధాని
  • మ్యాచ్ లో చివరి వరకు పోరాడిందంటూ టీమిండియాపై ప్రశంసలు

వరల్డ్ కప్ సెమీఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పాలవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ నిరాశ వ్యక్తం చేశారు. అయితే, గెలుపోటములు జీవితంలో భాగం అని, మ్యాచ్ ఫలితం అసంతృప్తి కలిగించినా, టీమిండియా కడవరకు పోరాడిన తీరు అకట్టుకుందని పేర్కొన్నారు. భారత జట్టు ఈ టోర్నీ మొత్తం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణించిందని, ఈ విషయంలో మనందరం గర్వించాలని దేశవాసులకు సూచించారు.

More Telugu News