Uma Yadav: టీడీపీ నేత ఉమా యాదవ్ హత్య కేసులో 12 మంది అరెస్ట్

  • ప్రధాన నిందితుడిగా తోట శ్రీనివాసరావు యాదవ్
  • నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
  • 12 మందికీ రిమాండ్ విధించిన కోర్టు

గత నెల 25న మంగళగిరిలో టీడీపీ నేత ఉమా యాదవ్‌ను అత్యంత దారుణంగా ప్రత్యర్థులు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమా యాదవ్ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా తోట శ్రీనివాసరావు యాదవ్ ఉన్నారు. పోలీసులు ఆయనతో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపరిచారు. ఆ 12 మందికీ న్యాయస్థానం రిమాండ్ విధించింది. కేసు విచారణలో భాగంగా ఆధిపత్య పోరు కారణంగానే నిందితులు ఉమా యాదవ్‌ను హత్య చేసినట్టు తెలిసింది. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు.

More Telugu News