JDS: ​ ఒత్తిడిని జయించేందుకు బెంగళూరు రిసార్ట్ లో యోగా ప్రాక్టీసు చేస్తున్న జేడీఎస్ ఎమ్మెల్యేలు

  • ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్ పాట్లు
  • ఖరీదైన రిసార్ట్ కు తరలింపు
  • ఒక్కో వ్యక్తికి రోజుకు రూ.15 వేలు ఖర్చు

కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్ అధినాయకత్వం వారిని బెంగళూరు నగర శివార్లలో ఉన్న ఓ రిసార్ట్ కు తరలించిన సంగతి తెలిసిందే. దీనిపేరు పాడింగ్టన్ రిసార్ట్. ఇది ఎంతో ఖరీదైన రిసార్ట్. ఇక్కడ ఓ వ్యక్తి బస చేస్తే రోజుకు రూ.15 వేలు ఖర్చవుతుంది. అలాంటి విలాసవంతమైన రిసార్ట్ లో ఉంటున్నా ఎమ్మెల్యేలపై రాజకీయపరమైన ఒత్తిడి ఉండనే ఉంటుంది. అందుకే వారు రిలాక్స్ అయ్యేందుకు యోగాను ఆశ్రయించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం యోగాసనాలు వేస్తూ ఒత్తిడిని జయించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి.

More Telugu News