Andhra Pradesh: ‘అయ్యా ముఖ్యమంత్రిగారూ..’ అంటూ జగన్ పై వర్ల రామయ్య ప్రశ్నల వర్షం

  • తెలుగు తల్లిని ఎందుకు అవమానిస్తున్నారు?
  • మా తెలుగు తల్లికి ప్రార్థనా గీతం ఏమైంది?
  • అమ్మను అవమానిస్తారా?

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు, ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఆ పార్టీ నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు. ‘తెలుగు తల్లి’ గురించి ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ లో జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘అయ్యా ముఖ్యమంత్రిగారూ, తెలుగు తల్లిని ఎందుకు అవమానిస్తున్నారు? మా తెలుగు తల్లికి ప్రార్థనా గీతం ఏమైంది? అమ్మను అవమానిస్తారా? ఇదేమి పద్ధతి? ఇదేనా రాజన్న రాజ్యం’ అని ప్రశ్నించారు.

More Telugu News