Oh Baby: సెట్లో నేను ఒక్కసారే ఆమెను పలకరించాను: నటుడు నాగశౌర్య

  • సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మీ నాకు ఎంతో ఇష్టమైన నటి
  • ఆమె నటిస్తున్నారని తెలిసే ‘ఓ బేబీ’లో చేశాను
  •  సిగ్గు వల్ల ఎక్కువగా మాట్లాడాను 

‘ఓ బేబీ’ చిత్రంలో నటించిన నటుడు నాగశౌర్య ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో నాగశౌర్య మాట్లాడుతూ, ఈ చిత్రంలో తనది అతిథి పాత్ర అని, కానీ, సెట్లోకి వెళ్లాక ఫుల్ లెంగ్త్ పాత్ర అయిందని చెప్పాడు. సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి తనకు ఎంతో ఇష్టమైన నటి అని, అందుకే, ఈ చిత్రంలో తనది అతిథిపాత్ర అని చెప్పినా చేేసేందుకు అంగీకరించానని అన్నాడు.

‘లక్ష్మి గారు సెట్లో ఉన్నప్పుడు ఒక రోజు మొత్తం సమంత గారు, నేను అక్కడే ఉన్నాం. నేను ఒక్కసారే ఆమెను పలకరించాను’ అని, ఆ తర్వాత దూరం నుంచి ఆమెను చూస్తూ నిలబడ్డానని చెప్పుకొచ్చాడు. తనకు సిగ్గు ఎక్కువ అని చెప్పిన నాగశౌర్య, చాలామంది దాన్ని పొగరు అనుకుంటుంటారని అన్నాడు. తన సిగ్గు వల్ల రొమాంటిక్ సీన్స్ కు దూరంగా ఉంటున్నానని, తప్పని పరిస్థితుల్లోనే ఆ సీన్స్ లో నటిస్తానని చెప్పాడు.

More Telugu News