Harish Rao: మంత్రి నా కాళ్లకు మొక్కారన్నది పూర్తిగా అవాస్తవం: హరీశ్ రావు

  • హరీశ్ కాళ్లు మొక్కేందుకు ఇంద్రకరణ్ రెడ్డి యత్నించారంటూ కథనం
  • తప్పుగా అర్థం చేసుకున్నారన్న హరీశ్
  • వార్తలు ప్రచురించే ముందు నిర్ధారించుకోవాలని సూచన

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి హరీశ్ రావు కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారంటూ ఓ పత్రికలో కథనం వచ్చింది. ఈ కథనంపై హరీశ్ రావు స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని చెప్పారు. గౌరవనీయులైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగారు నేల మీద నుంచి లేచి నిలబడేందుకు యత్నిస్తుండగా తాను సాయపడ్డానని తెలిపారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ప్రచురించారని అన్నారు. ఈ వార్తను ఖండిస్తున్నానని.... భవిష్యత్తులో ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు ఒకసారి నిర్ధారించుకుని ప్రచురించాలని కోరారు. ఇది చాలా బాధాకరమైన విషయమని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

More Telugu News