Chandrababu: చంద్రబాబు భద్రత పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ

  • ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
  • తన భద్రతను పునరుద్ధరించాలని కోరిన బాబు
  • చంద్రబాబుకు ఎక్కువ భద్రతే కల్పించామంటున్న డీజీపీ

తన భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఇటీవల ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 2న ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరపడం విదితమే. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. కాగా, చంద్రబాబుకు భద్రత నిమిత్తం ప్రస్తుతం ఓ డీఎస్పీతో పాటు నలుగురు కానిస్టేబుళ్లను మాత్రమే కేటాయించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబుకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని, ఆయన భద్రత కుదింపుపై పున:సమీక్షించాలని కోరుతున్నారు. అయితే, చంద్రబాబుకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రతే కల్పించామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గతంలో స్పష్టం చేయడం గమనార్హం. 

More Telugu News