Andhra Pradesh: అనంతపురం నారాయణ కాలేజీలో విద్యార్థిని చితక్కొట్టిన అధ్యాపకులు.. రణరంగంగా మారిన క్యాంపస్!

  • అనంతపురం పట్టణంలో ఘటన
  • ఓ విద్యార్థిపై దాడిచేసిన అధ్యాపకులు
  • విద్యార్థులకు మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘాల నేతలు

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో నారాయణ కాలేజీ అధ్యాపకులు రెచ్చిపోయారు. ఓ విద్యార్థిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో తిరగబడ్డ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాలేజీ ఏజీఎం, ప్రిన్సిపాల్ లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా, అధ్యాపకులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. విద్యార్థిపై దాడిచేసిన అధ్యాపకులను తొలగించేవరకూ వెనక్కి తగ్గబోమని ఈ సందర్భంగా తోటి విద్యార్థులు స్పష్టం చేశారు. కాగా, అసలు అధ్యాపకులు విద్యార్థిని ఎందుకు కొట్టారు? దాడిచేసిన అధ్యాపకులు ఎవరు? అనే విషయమై వివరాలు తెలియాల్సివుంది. 

More Telugu News