Team India: స్టేడియంకు వెళుతున్న టీమిండియా బస్సుపై పువ్వులు చల్లి శుభాకాంక్షలు తెలిపిన అభిమాని

  • నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య సెమీఫైనల్
  • ఆతిథ్యమిస్తోన్న ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం
  • అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ లో నేడు భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నాయి. మాంచెస్టర్ వేదికగా జరిగే ఈ కీలక సమరం ఇరు జట్ల అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. కాగా, సెమీఫైనల్ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోన్న ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానానికి చేరుకునేందుకు టీమిండియా ఆటగాళ్లు బస్సులో పయనమయ్యారు. ఈ సందర్భంగా క్రికెటర్లు బస చేసిన హోటల్ వద్ద అభిమానులు పెద్ద ఎత్తున గుమికూడి శుభాకాంక్షలు తెలిపారు. ఆటగాళ్లు బస్సులోకి ఎక్కుతుండగా ఓ వ్యక్తి బస్సుపై పువ్వులు చల్లుతూ టీమిండియా గెలవాలంటూ నినాదాలు చేశాడు. అక్కడ చేరిన అభిమానులు కూడా జీతేగా జీతేగా ఇండియా జీతేగా, భారత్ మాతాకీ జై అంటూ జట్టును ఉత్సాహపరిచారు.

More Telugu News