Vijayawada: రాంప్రసాద్ హత్య కేసు..హైదరాబాద్ పోలీసుల అదుపులో కోగంటి సత్యం

  • కోగంటి సత్యంపై పలు అనుమానాలు
  • నిందితుడు శ్యామ్ కు సుపారీ ఇచ్చాడన్న అనుమానం
  • వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్ అదుపులో సత్యం

ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాంప్రసాద్ ను హత్య చేసింది తానే అంటూ నిందితుడు శ్యామ్ కొన్ని గంటల క్రితం ‘టీవీ 9’ ముందు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఈ హత్య కేసుతో ప్రముఖ వ్యాపారి, బెజవాడ రౌడీ షీటర్ కోగంటి సత్యంకు ఎలాంటి సంబంధం లేదని శ్యామ్ చెప్పాడు. కానీ, శ్యామ్ చెప్పిన పలు విషయాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఈ హత్య చేయించింది కోగంటి సత్యమేనని రాంప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోగంటి సత్యంను హైదరాబాద్ లోని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాంప్రసాద్ హత్య వెనుక కోగంటి సత్యం హస్తం ఉందని, నిందితుడు శ్యామ్ కు సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

More Telugu News