Andhra Pradesh: ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి నియామకం

  • వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి దక్కిన మరో పదవి
  • ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
  • తక్షణం అమల్లోకి రానున్న ఉత్తర్వులు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరో పదవి దక్కింది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా, ఈ పదవిని లాభదాయక పదవుల నుంచి గవర్నర్ తొలగించారు. గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా తిరిగి ఈ పదవిలో విజయసాయిరెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించడం గమనార్హం.

More Telugu News