Hyderabad: పూరీలు సకాలంలో తేలేదని కస్టమర్ మండిపాటు.... మరుగుతున్న నూనె పోసిన హోటల్ కుక్

  • హైదరాబాద్ పాతబస్తీలో ఘటన
  • సకాలంలో సర్వ్ చేయని కుక్ పై కస్టమర్ దాడికి యత్నం
  • బాండీలో నూనె కస్టమర్ ముఖాన పోసిన కుక్

హైదరాబాద్ పాతబస్తీలో ఓ కస్టమర్ కు, హోటల్ కుక్ కు మధ్య ఘర్షణ జరిగింది.  మహ్మద్ బిన్ బక్షాది అనే వ్యక్తి చాంద్రాయణగుట్టలో ఉండే ఓ హోటల్ లో అల్పాహారం కోసం వచ్చాడు. పూరీలు కావాలంటూ అక్కడ కుక్ గా పనిచేస్తున్న సయ్యద్ ఇబ్రహీంను కోరాడు. 15 నిమిషాలు ఆలస్యం అవుతుందని ఆ కుక్ బదులిచ్చాడు. అయితే ఎంతసేపు ఎదురుచూసినా పూరీలు సర్వ్ చేయకపోవడంతో బక్షాదిలో కోపం కట్టలు తెంచుకుంది. కుక్ ను నిలదీయడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరూ అసభ్యకరమైన రీతిలో పరస్పరం దూషించుకున్నారు.

ఈ నేపథ్యంలో, బక్షాది అక్కడినుంచి వెళ్లిపోయి మరో నలుగుర్ని వెంటేసుకుని వచ్చాడు. తనపై దాడికి దిగే ప్రయత్నం చేయగా, కుక్ బాండీలో మరుగుతున్న నూనెను బక్షాది ముఖాన విసిరికొట్టాడు. దాంతో ఆ కస్టమర్ మెడ, చేతులపైనా నూనె పడడంతో గాయాలయ్యాయి. దీనిపై బక్షాది పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News