Prakasam District: ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడి

  • మార్కాపురం మండలంలోని కొండేపల్లిలో ఘటన
  • వైసీసీ కార్యకర్తలకు ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి విందు
  • ఈ విందుకు ఎందుకొచ్చారంటూ తల్లీకొడుకుపై దాడి

ఏపీలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కొండేపల్లిలో టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి తన స్వగ్రామంలో కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరైన తల్లి, కుమారుడిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వైసీపీ విందుకు మీరెందుకు వచ్చారు? అంటూ తల్లి సువార్తమ్మ, కొడుకు సురేశ్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాళ్లిద్దరికీ గాయాలయ్యాయి. బాధితులకు మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

More Telugu News