Virat Kohli: టీమిండియా సారథి కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

  • ప్రపంచకప్‌లో కోహ్లీ వెయ్యి పరుగులు
  • సచిన్, గంగూలీ సరసన టీమిండియా సారథి
  • శ్రీలంకతో మ్యాచ్‌లో ఘనత

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ.. ప్రపంచకప్‌లో వెయ్యి పరుగులు సాధించిన మూడో ఇండియన్‌గా చరిత్రకెక్కాడు. గతంలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో ఐదు పరుగులు సాధించిన వెంటనే కోహ్లీ ఖాతాలో వెయ్యి పరుగులు చేరాయి. ప్రపంచకప్‌లో సచిన్ 2,278 పరుగులు చేయగా, గంగూలీ 1,006 పరుగులు చేశాడు. ఇప్పుడు వీరి సరసన కోహ్లీ చేరాడు.

More Telugu News