Sri Lanka: టీమిండియాపై భారీ భాగస్వామ్యం దిశగా మాథ్యూస్, తిరిమన్నే జోడీ

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక
  • ఆదుకున్న మాథ్యూస్, తిరిమన్నే

లీడ్స్ లో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో ఏంజెలా మాథ్యూస్, లహిరు తిరిమన్నే జోడీ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా పరిణమిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక టీమిండియా బౌలర్ల ధాటికి 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే, మిడిలార్డర్ లో మాథ్యూస్, తిరిమన్నే జోడీ భారత బౌలర్లను సమర్థంగా నిలువరించింది. మొదట్లో ఆచితూచి ఆడినా క్రమంగా జోరుపెంచి స్కోరుబోర్డును ముందుకు ఉరికించింది. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 28 ఓవర్లలో 4 వికెట్లకు 118 పరుగులు కాగా, మాథ్యూస్ 36, తిరిమన్నే 27 పరుగులతో ఆడుతున్నారు.

More Telugu News