Toss: చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియాకు మొహంచాటేసిన టాస్

  • లీడ్స్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన శ్రీలంక
  • బ్యాటింగ్ ఎంచుకున్న లంక సారథి
  • రెండు మార్పులతో బరిలో దిగిన భారత్ 

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో నేటితో లీగ్ దశ ముగియనుంది. లీడ్స్ లో భారత్-శ్రీలంక, మాంచెస్టర్ లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ముందుగా, లీడ్స్ లోని హెడింగ్లే మైదానంలో భారత్, లంక జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక సారథి దిముత్ కరుణరత్నే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్ గెలిచి టోర్నీ లీగ్ దశను విజయంతో ముగించాలని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ భావిస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులతో బరిలో దిగుతోంది. చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ స్థానంలో రవీంద్ర జడేజా తుదిజట్టులో ఆడుతున్నారు. 

More Telugu News