Kesineni Nani: మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికే..!: ఆ నలుగురిపై కేశినేని నాని సెటైర్

  • మీరిచ్చింది బిల్డప్ మాత్రమే
  • ప్రజలకు విషయం అర్థమయింది
  • నలుగురు ఎంపీలపై సెటైర్

తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన నలుగురు ఎంపీలను ఉద్దేశించి విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని వారు ఉద్ధరించుకోవడానికే బీజేపీలో చేరారని సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టిన నాని, "మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్ధమయ్యింది, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోడానికి బీజేపీలోకి చేరారో అని" అని అన్నారు.

More Telugu News