Jacqueline: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ప్రభాస్ తో చిందేసిన జాక్వెలిన్? 
  • గ్రామీణ నేపథ్యంలో పరశురామ్ 
  • సంపూ సినిమా సెన్సార్ పూర్తి 
  • మళ్లీ అన్నదమ్ముల కలయిక

*  బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తాజాగా 'సాహో' చిత్రంలో నటించినట్టు సమాచారం. ప్రభాస్ తో కలసి ఓ ప్రత్యేక పాటలో ఈమె డ్యాన్స్ చేసినట్టు, తాజాగా ఈ పాటను ఆస్ట్రియాలో చిత్రీకరించినట్టు చెబుతున్నారు.
*  'గీత గోవిందం' వంటి భారీ విజయాన్ని ఇచ్చిన దర్శకుడు పరశురామ్ కాస్త గ్యాప్ తీసుకుని తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈసారి గ్రామీణ నేపథ్యంలో ఓ చిత్రాన్ని రూపొందించే ఉద్దేశంతో కథను సిద్ధం చేసుకుంటున్నాడట. ఇందులో మహేశ్ బాబు నటిస్తాడని కొందరంటుంటే, విజయ్ దేవరకొండ నటిస్తాడని మరికొందరు అంటున్నారు.
*  బర్నింగ్ స్టార్ గా పేరుతెచ్చుకున్న సంపూర్నేశ్ బాబు హీరోగా నటించిన 'కొబ్బరిమట్ట' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. త్వరలో దీనిని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
*  తమిళ హీరో ధనుశ్, దర్శకుడు సెల్వరాఘవన్ సోదరులన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో గతంలో మూడు హిట్స్ వచ్చాయి. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలసి ఇప్పుడు ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

More Telugu News