Check Bouns: పూతలపట్టు ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఒంగోలు న్యాయస్థానం

  • ఎంఎస్ బాబు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది
  • కోర్టును ఆశ్రయించిన ఒంగోలుకు చెందిన వ్యక్తి
  • కోర్టు విచారణకు సైతం బాబు గైర్హాజరు

చెక్ బౌన్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో ఒంగోలుకు చెందిన వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఎంఎస్ బాబు కోర్టు విచారణకు సైతం హాజరు కాకపోవడంతో ఒంగోలు సంచార న్యాయస్థానం ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

More Telugu News