East Godavari District: 8వ తరగతి విద్యార్థినిని రహస్యంగా పెళ్లి చేసుకున్న ఉపాధ్యాయుడు

  • తూర్పుగోదావరి జిల్లా దాలిపాడులో దారుణం
  • బాలికను లోబరుచుకుని ఏడాదిగా సంబంధాన్ని కొనసాగిస్తున్న ఉపాధ్యాయుడు
  • పెద్దల సమక్షంలో రహస్య వివాహం

తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం దాలిపాడులో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. స్థానిక గిరిజన బాలికోన్నత ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికను ఆ పాఠశాలలో పని చేస్తున్న బెలెం చినబ్బాయి అనే ఉపాధ్యాయుడు రహస్య వివాహం చేసుకున్నాడు. ఆ పాఠశాలకు ఆయన వార్డెన్ గా కూడా విధులు నిర్వహిస్తున్నాడు.

సదరు విద్యార్థినిని మాయమాటలతో లోబరుచుకున్న చినబ్బాయి... ఏడాది కాలంగా ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం కాస్తా విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిసిపోయింది. దీంతో, చినబ్బాయిని వారు నిలదీశారు. అంతేకాదు, గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, పెద్దల సమక్షంలో బాలికను చినబ్బాయి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.

More Telugu News