Rashmi: వాళ్లకి పనీపాటా లేదు.. పనికొచ్చే వాటిపై శ్రద్ధ పెట్టండి: రష్మి ఫైర్

  • సెలబ్రిటీల పేర్లను వాడుకుంటున్నారు
  • సెలబ్రిటీలు చేసే మంచి పనులను కూడా చూడండి
  • ఒక మంచి పనిని కూడా అభిమానులు పాటించట్లేదు

కికీ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ రకరకాల ఛాలెంజ్‌లు యూత్‌ని ఉర్రూతలూగించాయి. తాజాగా ‘బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌’ వచ్చింది. ఈ ఛాలెంజ్ లక్ష్యం ఏంటంటే, ఓ టేబుల్‌పై బాటిల్‌ను పెట్టి, దాని మూతను లూజ్ గా ఉంచాలి. దానికి కొద్ది దూరంలో నిలబడి మూతను బాటిల్ కింద పడకుండా తన్నాలి. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఈ ఛాలెంజ్‌లో విజయవంతమవడమే కాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు సైతం బాటిల్ క్యాప్ ఛాలెంజ్‌ను స్వీకరించి తమ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అయితే ఈ ఛాలెంజ్‌పై ప్రముఖ యాంకర్ రష్మి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఛాలెంజ్ నిజంగా సీరియస్‌గా తీసుకుంటున్న వాళ్లకి పనీపాటా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిపై పెట్టే శ్రద్ధను పనికొచ్చే వాటిపై పెట్టాలని సూచించింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలనుకుంటున్న వారు సెలబ్రిటీల పేర్లను వాడుకుంటున్నారని.. అలాంటి వారు సెలబ్రిటీలు చేసే మంచి పనులను కూడా చూడాలని తెలిపింది. సెలబ్రిటీలు చేసే మంచి పనుల్లో ఒక్క దాన్ని కూడా వారి అభిమానులు పాటించట్లేదని పేర్కొంది.

More Telugu News