Pulivendula: పులివెందులలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

  • గొంతు కోసి హత్య చేసిన దుండగులు 
  • పట్టణంలోని రాణితోపులో
  • పరిస్థితిని సమీక్షించిన పోలీసులు 

గుర్తు తెలియని ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన పులివెందులలో కలకలం రేపింది. పట్టణంలోని రాణితోపులో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హత మార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. 

More Telugu News