vangaveeti: జనసేనలో చేరికపై నోరు మెదపని వంగవీటీ రాధాకృష్ణ

  • విజయవాడలో ఘనంగా రంగా జయంతి వేడుకలు
  • భారీ ఎత్తున హాజరైన అభిమానులు
  • నాన్న ఆశయ సాధన కోసం కృషి చేస్తానన్న రాధ

దివంగత వంగవీటి మోహనరంగా 72వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. బందరు రోడ్డులో రంగా విగ్రహం వద్ద పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. రాధ- రంగా మిత్రమండలి సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఇటీవలి కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో రాధ రెండు సార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, జనసేనలో రాధ చేరబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. దీంతో, ఈ రోజు జరిగిన రంగా జయంతి కార్యక్రమంలో జనసేనలో చేరికపై రాధ క్లారిటీ ఇస్తారని అందరూ భావించారు. కానీ, ఆయన ఆ ఊసే ఎత్తలేదు.

ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, నాన్న రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు. రంగా ఏ ఒక్క వర్గానికో చెందిన వ్యక్తి కాదని... పేద, బడుగు వర్గాల ఉన్నతి కోసం పాటుపడ్డారని తెలిపారు. 

More Telugu News