Andhra Pradesh: ఆర్టీసీ బస్సులో చేతివాటం.. రూ.10 లక్షల నగదును దోచేసిన దొంగలు!

  • గుంటూరు నుంచి హైదరాబాద్ కు వెళుతున్న బస్సు
  • నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద నగదు మిస్సింగ్
  • టిఫిన్ కు వెళ్లివచ్చేలోపే నగదు తస్కరణ

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఈరోజు భారీ చోరీ చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు టిఫిన్ చేసేందుకు దిగగా, అతని బ్యాగులోని రూ.10.30 లక్షల నగదును దుండగులు తస్కరించారు. గుంటూరులోని మంగళగిరికి చెందిన ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులో ఈరోజు హైదరాబాద్ కు బయలుదేరాడు.

ఈ క్రమంలో నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి శివారులో టిఫిన్ కోసం డ్రైవర్ బస్సును ఆపాడు. ఈ క్రమంలో టిఫిన్ తినివచ్చిన సదరు వ్యక్తి తన బ్యాగులో రూ.10.30 లక్షల నగదు మాయం అవడాన్ని గుర్తించాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన నార్కెట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News