MS Dhoni: 'ఈ ఫొటో చూసి చెప్పండి' అంటున్న ధోనీ అభిమానులు!

  • ధోనీ బొటనవేలికి గాయం
  • బాధను దిగమింగి ఆట కొనసాగింపు
  • వైరల్ అవుతున్న ఫొటోలు

బ్రిటన్ లో జరుగుతున్న వరల్డ్ కప్ లో భారత జట్టు కీపర్, స్టార్ బ్యాట్స్ మెన్ ఎంఎస్ ధోనీ, విఫలమవుతున్నాడన్న విమర్శలు వస్తున్న వేళ, సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. తన వేలికి గాయమై రక్తం కారుతున్నా, నొప్పిని బిగబట్టిన ధోనీ, మ్యాచ్ కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోను ధోనీ అభిమానులు వైరల్ చేస్తూ, అతన్ని విమర్శిస్తున్న వారిని తిరిగి ప్రశ్నిస్తున్నారు.

 జట్టు ప్రయోజనాలంటే ధోనీకి ఎంత ముఖ్యమో ఈ చిత్రాన్ని చూసి చెప్పాలని అడుగుతున్నారు. ధోనీ వల్ల ఎన్ని విజయాలు ఇండియాకు దగ్గరయ్యాయో మరువరాదని చెబుతూ, వేలికి గాయమైతే నోట్లో పెట్టుకుని కారుతున్న రక్తాన్ని ధోనీ ఉమ్మివేస్తున్న ఫొటోలను పోస్ట్ చేశారు. మిస్టర్‌ కూల్‌ ధోనీ అంకితభావాన్ని ప్రశ్నించేవారికి ఈ ఫొటోయే సమాధానమని కౌంటర్ ఇస్తున్నారు. 

More Telugu News