Narendra Modi: మోదీతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ

  • కుటుంబ సభ్యులతో కలిసి మోదీతో భేటీ
  • 20 నిమిషాల పాటు మంతనాలు
  • మర్యాదపూర్వకంగానే కలిశానన్న ఎంపీ

ప్రధాని నరేంద్రమోదీని నేడు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కుటుంబ సభ్యులతో కలసి కలిశారు. మోదీతో దాదాపు 20 నిమిషాల పాటు మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే భేటీ వెనుక కారణాలు మాత్రం తెలియరాలేదు. దీనిపై రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ, తాను మోదీని మర్యాదపూర్వకంగానే కలిశానని తెలిపారు.   

More Telugu News