cuddapah: ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి.. ఇడుపులపాయ వెళ్లనున్న జగన్!

  • రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సాఆర్ జయంతి కార్యక్రమాలు
  • సిద్ధమవుతున్న వైసీపీ శ్రేణులు  
  • వైఎస్ ఘాట్ లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్న జగన్

ఈ నెల 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సాఆర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. కడప జిల్లా ఇడుపులపాయలో నిర్వహించనున్న ఈ జయంతి కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వైఎస్ ఘాట్ లో ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ను ప్రారంభించనున్నారు. వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు.  

More Telugu News