Andhra Pradesh: ‘ఓ బేబీ’ సినిమాకు మరో గౌరవం.. చెన్నైలో ఎర్లీ మార్నింగ్ షోకు అనుమతి!

  • జీకే సినిమాస్ లో ఉదయం 8 గంటలకు షో
  • తెలుగు కంటే తమిళంలోనే ముందుగా రిలీజ్
  • చెన్నైలోనే పుట్టి పెరిగిన సమంత  

హీరోయిన్ సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ సినిమా ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా దీన్ని ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సమంత నటించిన ‘ఓ బేబీ’ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.

ఈ సినిమాను ఉదయం 8 గంటలకు(ఎర్లీ మార్నింగ్ షో) ప్రదర్శించేందుకు అనుమతి లభించింది. చెన్నైలోని ప్రఖ్యాత ‘జీకే సినిమాస్’ థియేటర్ లో ఓ బేబీ సినిమా స్పెషల్ షో వేస్తున్నారు. అంటే తెలుగు కంటే తమిళంలోనే ‘ఓ బేబీ’ ముందుగా రిలీజ్ కాబోతోందన్న మాట. అన్నట్లు సమంత పుట్టి పెరిగింది చెన్నైలోనే కావడం గమనార్హం.

More Telugu News