Kandi IIT: ఐఐటీ-హైదరాబాద్‌లో విద్యార్థి ఆత్మహత్య

  • ఎం డిజైన్ సెకండ్ ఇయర్ చదువుతున్న చార్లెస్
  • ఉరి వేసుకుని ఆత్మహత్య
  • చార్లెస్ స్వస్థలం వారణాసి

ఓ విద్యార్థి ఆత్మహత్యతో ఐఐటీ-హైదరాబాద్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన మార్క్ ఆండ్రూ చార్లెస్ సంగారెడ్డి సమీపంలోని కంది ఐఐటీలో ఎం డిజైన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నేడు చార్లెస్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. చార్లెస్ ఆత్మహత్యతో ఐఐటీ ప్రాంగణంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే అతని ఆత్మహత్యకు కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

More Telugu News