jagan: మాకు న్యాయం చేయండి: జగన్‌ నివాసం ఎదుట ఆరోగ్యమిత్రల ఆందోళన

  • 13 జిల్లాల నుంచి తరలి వచ్చిన ఆరోగ్యమిత్రలు
  • గ్రామ వాలంటీర్లకు తమ విధులను అప్పగించబోతున్నారంటూ ఆందోళన
  • అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం

అమరావతి సమీపంలోని తాడేపల్లిలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద ఆరోగ్యమిత్రలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కొత్తగా నియమిస్తున్న గ్రామ వాలంటీర్లకు తమ విధులను అప్పగించనున్నారనే సమాచారం తమ వద్ద ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. జీతం లేకపోయినా కమిషన్ ప్రాతిపాదికన తాము పని చేస్తున్నామని చెప్పారు. తమ భయాందోళనలపై జగన్ స్పందిచాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆరోగ్యమిత్రలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తమను అడ్డుకున్న పోలీసులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాగ్వాదానికి దిగారు. 

More Telugu News