Andhra Pradesh: జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. సింగపూర్‌కు విమాన సర్వీసులు రద్దు

  • జూన్ నెలాఖరుతోనే ముగిసిన ఒప్పందం
  • పొడిగింపునకు ముందుకు రాని ఏపీ సర్కారు
  • నిలిచిపోయిన సేవలు

ఏపీలోని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విజ్ఞప్తితో అమరావతి-సింగపూర్ నగరాల మధ్య గతేడాది డిసెంబరులో ప్రారంభమైన విమాన సేవలను రద్దు చేసింది. వీజీఎస్ (వయబులిటీ గ్యాప్ ఫండింగ్) విధానంలో ప్రభుత్వంతో ఇండిగో సంస్థ చేసుకున్న ఈ ఒప్పందాన్ని తాజాగా ఏపీ సర్కారు రద్దు చేసింది. జూన్ చివరి నాటికే ఒప్పందం ముగిసినా ఒప్పందం పొడిగింపునకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఇండిగో సంస్థ తమ సేవలను నిలిపివేసింది.

More Telugu News