Atchampet: లంచం డిమాండ్ చేసిన అచ్చంపేట వీఆర్వో సస్పెన్షన్

  • పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చేందుకు లంచం డిమాండ్
  • ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన ఓ రైతు
  • పుల్లయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు

ఓ రైతు వద్ద లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో గుంటూరు జిల్లా అచ్చంపేట వీఆర్వో పుల్లయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. పట్టాదారు పాసు పుస్తకం కోసం రైతు వద్ద రూ.50 వేలు లంచం డిమాండ్ చేసినట్టు ‘స్పందన’ కార్యక్రమంలో అధికారులకు ఓ రైతు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఇది నిజమేనని తేల్చారు. ఈ నేపథ్యంలో పుల్లయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశించారు.

More Telugu News