Andhra Pradesh: కుదించిన భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్

  • చంద్రబాబు భద్రతను కుదించిన ఏపీ ప్రభుత్వం
  • దీనిపై  హైకోర్టులో పిటిషన్ వేసిన చంద్రబాబు
  • రేపు విచారణకు వచ్చే అవకాశం

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు తనకు కుదించిన భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను న్యాయస్థానం స్వీకరించింది. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, గతంలో చంద్రబాబుకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీతో పాటు ముగ్గురు ఆర్ఐ బృందాలతో భద్రత కల్పించారు. ఏపీలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం చంద్రబాబుకు ఉన్న ఆ భద్రతను కుదించింది. కేవలం, ఇద్దరు కానిస్టేబుళ్ల చొప్పున మూడు బృందాలను కేటాయించింది.

More Telugu News