Sri Lanka: ఎవరు గెలిచినా ఎలాంటి ప్రయోజనంలేని మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్

  • టీమిండియా ఓటమితో మారిన సమీకరణాలు
  • శ్రీలంక సెమీస్ చాన్సులు గల్లంతు
  • అప్రాధాన్య పోరులో విండీస్ తో తలపడుతున్న లంకేయులు

వరల్డ్ కప్ లో భాగంగా నిన్న టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య పోరు జరగ్గా, అందులో కోహ్లీసేన ఓటమిపాలైంది. ఈ ఫలితంతో అనేక జట్ల సెమీస్ అవకాశాలు దెబ్బతిన్నాయి. అలాంటి వాటిలో శ్రీలంక ఒకటి. ఇప్పుడా జట్టు వెస్టిండీస్ తో తలపడుతోంది. చెస్టర్ లీ స్ట్రీట్ లో మొదలైన ఈ మ్యాచ్ లో విండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ పోరులో ఎవరు గెలిచినా సెమీస్ చాన్సులు లేకపోవడంతో మ్యాచ్ కు ఏమంత ప్రాధాన్యం లేకపోయింది. ఇక, బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. కెప్టెన్ కరుణరత్నే 14 పరుగులతోనూ, కుశాల్ పెరెరా 13 పరుగులతోనూ ఆడుతున్నారు.

More Telugu News