Chandrababu: రేపటి నుంచి రెండు రోజులపాటు చంద్రబాబు కుప్పం పర్యటన

  • నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పనున్న బాబు
  • నాలుగు మండలాల్లోని గ్రామాల్లో పర్యటన
  • రూట్ మ్యాప్ సిద్ధం చేసిన నేతలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 2,3 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలను, పార్టీ కార్యకర్తలను, అభిమానులను కలిసి ధన్యవాదాలు చెప్పే ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టనున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని గ్రామాల్లో బాబు పర్యటించనున్నారు. ఈ మేరకు స్థానిక టీడీపీ నేతలు రూట్‌మ్యాప్ సిద్ధం చేసినట్టు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ తెలిపారు.

More Telugu News