Uttar Pradesh: కుటుంబంలోని బాలిక తమకంటే చదువులో ముందుందని అత్యాచారం చేసి వీడియో తీశారు!

  • ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక
  • పరీక్షల్లో బాలికకు ఫస్ట్ ర్యాంకు
  • బాలికను చూసి నేర్చుకోవాలంటూ పెద్దల హితవు
  • అక్కసు పెంచుకున్న బాలురు, టీచర్‌తో కలిసి అఘాయిత్యం

తమ కుటుంబంలోని బాలిక చదువులో ముందుండటంతో కుటుంబ పెద్దలు మిగిలిన పిల్లలను మందలించారు. దీంతో అక్కసు పెంచుకున్న నలుగురు విద్యార్థులు తమ పాఠశాలలోని టీచర్ సాయంతో విద్యార్థులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా దీనినంతా వీడియో తీసి వాట్సాప్‌లో షేర్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో సీతాపూర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, ఓ ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు విద్యార్థులు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. వీరిలో ఒక బాలిక, నలుగురు బాలురు కాగా బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. బాలురు పై తరగతిలో ఉన్నారు.

అయితే ఇటీవల జరిగిన పరీక్షల్లో బాలికకు ఫస్ట్ ర్యాంకు వచ్చింది. దీంతో కుటుంబ పెద్దలు బాలికను చూసి నేర్చుకోవాలంటూ మిగిలిన బాలురకు హితవు పలికారు. దీంతో అక్కసు పెంచుకున్న బాలురు సదరు బాలికపై ప్రతీకారానికి సిద్ధమయ్యారు. వీరితో పాఠశాలలోని ఓ టీచర్ కూడా చెయ్యి కలపాడు. శుక్రవారం బాలికను స్టాఫ్ రూమ్‌కు తీసుకెళ్లి మత్తు మందు కలిపిన ఆహారం తినిపించారు.

బాలిక స్పృహ కోల్పోయిన తరువాత ఐదుగురూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి దానినంతటినీ వీడియో తీసి వాట్సాప్‌లో షేర్ చేశారు. మెలకువ వచ్చాక బాలిక ఏమైందని ప్రశ్నిస్తే స్పృహ తప్పి పడిపోయావంటూ నమ్మించారు. అయితే విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకోగా, మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News