Syra: హీరో రామ్ చరణ్ తేజ్ కార్యాలయం ఎదుట ఆందోళన!

  • ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబసభ్యుల ఆందోళన
  • మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు
  • ఇప్పుడేమో మమ్మల్ని కలవడం లేదు

ప్రముఖ హీరో, నిర్మాత రామ్ చరణ్ తేజ్ కార్యాలయం ఎదుట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తీసుకున్న సమయంలో తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కనీసం తమను కలవడం లేదని ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఆ చిత్ర యూనిట్ పై ఆరోపణలు చేశారు.

కాగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. టైటిల్ రోల్ ను ప్రముఖ హీరో చిరంజీవి పోషిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్ రెడ్డి కాగా, హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

More Telugu News