world cup: వరల్డ్ కప్..టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు

  • బర్మింగ్ హోమ్ వేదికగా జరగనున్న మ్యాచ్
  • ఆరెంజ్ జెర్సీతో బరిలోకి దిగనున్న భారత జట్టు
  • ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ లో స్థానం

ప్రపంచకప్ లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. బర్మింగ్ హోమ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో ఆరెంజ్ జెర్సీతో భారత జట్టు బరిలోకి దిగనుంది.  టోర్నీలో అపజయం ఎరుగని ఏకైకజట్టుగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా సెమీస్ లో స్థానం సంపాదించుకుంటుంది. టీమిండియా ప్లేయర్  విజయశంకర్ స్థానంలో రిషబ్ పంత్ కు చోటు దక్కింది. 

More Telugu News