Radhika: నటి రాధిక దంపతుల అరెస్ట్ కు కోర్టు ఆదేశాలు!

  • రేడియన్స్ కు ఇచ్చిన చెక్ బౌన్స్
  • కోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థ
  • స్పందించకపోవడంతో అరెస్ట్ కు ఆదేశం

దక్షిణాది సెలబ్రిటీ జంట శరత్‌కుమార్, రాధికలను అరెస్ట్‌ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, రేడియన్స్‌ మీడియా సంస్థకు శరత్‌కుమార్, రాధికలు, నిర్మాత లిస్టిన్‌ స్టీఫెన్‌ లు రూ. 2 కోట్లు చెల్లించాల్సి వుండగా, దీనిపై గతంలోనే కేసు నమోదైంది. తమకు ఇవ్వాల్సిన రూ. 2 కోట్లను వారు ఇవ్వడం లేదని రేడియన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించగా, కోర్టు పలుమార్లు వారికి నోటీసులు అందించింది. కోర్టు నోటీసులకు ఈ జంట స్పందించకపోవడంతో వారిని అరెస్ట్ చేయాలని చెన్నైలోని సైదాపేట కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

లిస్టిన్ స్టీఫెన్ తో కలిసి శరత్ కుమార్, రాధికలు సినిమాలు నిర్మించిన వేళ, రేడియన్స్ నుంచి రుణం తీసుకుని, దాన్ని తీర్చేందుకు రూ. 2 కోట్లకు పైగా చెక్కిచ్చారు. ఇది బౌన్స్ కావడంతో సదరు సంస్థ సైదాపేట కోర్టును ఆశ్రయించింది. తాజాగా, వారిని అరెస్ట్‌ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేస్తూ, కేసు తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేశారు.

More Telugu News