Tamilnadu: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాను.. ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురి మృతి

  • గమ్య స్థానం మరో 14 కి.మీ ఉందనగా ప్రమాదం
  • కేరళలోని వలయార్‌కు వెళుతున్న కుటుంబం
  • క్షతగాత్రులు పాలక్కడ్ ఆసుపత్రికి తరలింపు

ఆగి ఉన్న లారీని వ్యాను ఢీకొట్టడంతో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ కుటుంబం కేరళలోని వలయార్‌కు వెళుతుండగా పాలక్కాడ్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. గమ్యస్థానం మరో 14 కిలోమీటర్లు ఉందనగా ఈ ప్రమాదం జరగడం గమనార్హం. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు ఓ మహిళ, వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన పాలక్కడ్ ఆసుపత్రికి తరలించారు.

More Telugu News