Anantapur District: అనంతపురం ఆర్ట్స్ కాలేజీ ఘటనలో ఐదుగురు నిందితుల అరెస్ట్

  • శివయ్య అనే యువకుడ్ని చావబాదిన గ్యాంగ్
  • అపస్మారక స్థితిలోకి వెళ్లినా కనికరించని యువకులు
  • నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో శివయ్య అనే యువకుడిపై దారుణమైన రీతిలో దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. మైదానంలో పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లినా ఆ యువకుడిపై ఓ గ్యాంగ్ విరుచుకుపడిన తీరు దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితులు కూడేరు మండలానికి చెందినవారిగా గుర్తించారు.

కాగా, ఈ దాడికి అనంతపురం ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. బాధితుడు శివయ్య కానీ, దాడికి పాల్పడిన వాళ్లు కానీ విద్యార్థులు కారు. పక్కా ప్లాన్ తోనే ఈ దాడికి ఆర్ట్స్  కాలేజీని వేదికగా చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ దాడికి ఓ యువతి వ్యవహారమే కారణమని సమాచారం. కాగా, పోలీసులు ఈ ఘటనలో హత్యాయత్నం కేసు నమోదు చేయడమే కాకుండా, నిందితులపై రౌడీషీట్ తెరిచారు.

More Telugu News