India: కొత్త జెర్సీల్లో ఎలా ఉన్నామో చూడండి... టీమిండియా ఆటగాళ్ల పోస్టులు!

  • టీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీలు
  • కాషాయం, నేవీ బ్లూ కలయికతో జెర్సీలకు రూపకల్పన
  • ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా నయా జెర్సీలు ధరించనున్న భారత ఆటగాళ్లు

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో పాల్గొంటున్న టీమిండియా ఆటగాళ్లకు సరికొత్త జెర్సీలు అందాయి. కాషాయం, నేవీ బ్లూ రంగుల కలయికతో ఉన్న ఈ నయా జెర్సీలను ధరించి ఆటగాళ్లు సందడి చేస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనీ, చహల్, రోహిత్ శర్మ, రాహుల్, షమీ తదితరులు కొత్త జెర్సీలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ ఆరెంజ్ జెర్సీలే హల్ చల్ చేస్తున్నాయి. ఆదివారం బర్మింగ్ హామ్ లో ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ సందర్భంగా ఈ బ్రాండ్ న్యూ జెర్సీలను టీమిండియా ఆటగాళ్లు ధరించనున్నారు. అంతేకాకుండా, ఇకమీదట విదేశాల్లో జరిగే సిరీస్ లు, టోర్నీల్లో ఆడే సమయంలో ఈ కొత్త జెర్సీలోనే భారత ఆటగాళ్లు ధరించే అవకాశాలున్నాయి.

More Telugu News