manthena satyanarayana raju: మంతెన సత్యనారాయణరాజుకు నోటీసులు ఇచ్చిన సీఆర్డీయే

  • కరకట్టపై సత్యనారాయణరాజు ఆశ్రమం
  • కరకట్ట పక్కన ఆరోగ్యాలయం
  • నోటీసులు జారీ చేసిన సీఆర్డీఏ

మంతెన సత్యనారాయణరాజుకు చెందిన ఆశ్రమానికి సీఆర్డీఏ అధికారులు ఇటీవల రెండు రకాల నోటీసులు జారీ చేశారు. కరకట్టపై ఆశ్రమాన్ని నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై ఈనెల 16న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వివరణ ఇచ్చేందుకు ఆశ్రమ నిర్వాహకులకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని సీఆర్డీఏకు హైకోర్టు సూచించింది.

ఇదే విధంగా కరకట్ట పక్కనే నిర్మించిన ఆరోగ్యాలయంలో కూడా నిబంధనలను ఉల్లంఘించారని నోటీసులు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసుల అంశంలో కూడా నిర్వాహకులకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. నిర్వాహకులు వివరణ ఇచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే, నోటీసులను జారీ చేసిన విషయాన్ని సీఆర్డీఏ అధికారులు గోప్యంగా ఉంచారు.

More Telugu News