tejashwi yadav: మైడియర్ బీహార్.. నేను ఇక్కడే ఉన్నా: తేజశ్వి యాదవ్

  • లోక్ సభ ఎన్నికల తర్వాత బహిరంగంగా కనిపించని తేజశ్వి
  • విమర్శలు గుప్పిస్తున్న ప్రత్యర్థులు
  • లిగమెంట్ కు చికిత్స చేయించుకుంటున్నానంటూ ట్వీట్

బీహార్ అసెంబ్లీ సమావేశాలకు ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ హాజరుకాకపోవడంపై ప్రత్యర్థి పార్టీ నేతలు విమర్శల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను ట్విట్టర్ ద్వారా తేజశ్వి తిప్పికొట్టారు. 'మై డియర్ బీహార్... నేను ఇక్కడే ఉన్నా. దెబ్బతిన్న లిగమెంట్ కు చికిత్స చేయించుకుంటున్నా' అని ట్వీట్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పరాభవంపాలైన తర్వాత నుంచి తేజశ్వి బహిరంగంగా కనిపించడం లేదు. దీంతో, ఆయనపై ప్రత్యర్థులు విమర్శలకు పదును పెట్టారు.

తన లిగమెంట్ దెబ్బతిందని... ఎప్పుడో చికిత్స చేయించుకోవాల్సి ఉన్నప్పటికీ చేయించుకోలేకపోయానని... గత కొన్ని వారాలుగా చికిత్స చేయించుకుంటున్నానని తేజశ్వి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాజకీయ ప్రత్యర్థులు, మీడియాలోని కొన్ని వర్గాలు మసాలా ఉన్న కథనాలను ప్రచారం చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు. ప్రజల పక్షాన తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని చెప్పారు. పేద ప్రజల కోసమే ఆర్జేడీ పుట్టిందని... ఒక్క ఓటమితో తాము కుంగిపోమని అన్నారు.

More Telugu News