vijayasai reddy: లోకేశ్ చిటికెడు మెదడు చిట్లినట్టుంది: విజయసాయిరెడ్డి

  • మంగళగిరి ప్రజలు తిప్పికొట్టిన తర్వాత మెదడు చిట్లినట్టుంది
  • స్థాయి మరచి చెలరేగిపోతున్నారు
  • మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉంది

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. మంగళగిరి ప్రజలు ఈడ్చికొట్టిన తర్వాత లోకేశ్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుందని... స్థాయి మరచిపోయి చెలరేగిపోతున్నారని వ్యాఖ్యానించారు. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మీ తండ్రి తమపై కుట్ర చేశారని... ఇప్పుడు అదే చిదంబరం, ఆయన కుమారుడు బెయిల్ పై బయట ఉన్నారని చెప్పారు. మీ దొంగల ముఠాకు మూడే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు.

More Telugu News