samanta'lakshmi: 'ఓ బేబీ' వేడుకకి ముఖ్య అతిథులుగా వెంకటేశ్ - రానా

  • నందినీ రెడ్డి నుంచి 'ఓ బేబీ'
  • ఈ రోజు సాయంత్రం వేడుక 
  • వచ్చేనెల 5న సినిమా విడుదల 

నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా 'ఓ బేబీ' నిర్మితమైంది. ఓ కొరియన్ సినిమాకి ఇది రీమేక్. 7 భాషల్లో ఆదరణ పొందిన ఈ కథను తెలుగులో రీమేక్ చేశారు. సీనియర్ హీరోయిన్ లక్ష్మి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, వచ్చేనెల 5వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ఆరంభించనున్నారు. హైదరాబాద్ లోని 'జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్' ఈ వేడుకకి వేదిక కానుంది. ఈ వేడుకకి వెంకటేశ్ - రానా ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన సమంతకి మరో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News