Mumbai: పూణేలో దారుణం.. గోడకూలి 15 మంది దుర్మరణం

  • మసీదు వద్ద కూలిన 60 అడుగుల గోడ
  • మృతుల్లో నలుగురు చిన్నారులు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు

మహారాష్ట్రలోని పూణేలో ఈ తెల్లవారుజామున గోడ కూలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 15కు పెరిగింది. నగరంలోని కొంధ్వా ప్రాంతంలోని తలాబ్ మసీదు వద్ద 60 అడుగుల ఎత్తున్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో తొలుత 12 మంది మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో 9 మంది పురుషులు, నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News