South Africa: ఎట్టకేలకు మరో గెలుపు దిశగా సఫారీలు... ఆమ్లా, డుప్లెసిస్ అర్ధసెంచరీలు

  • దక్షిణాఫ్రికా టార్గెట్ 204 పరుగులు
  • 30 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 159 పరుగులు
  • వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్

దక్షిణాఫ్రికా జట్టు ఎట్టకేలకు వరల్డ్ కప్ లో మరో విజయం దిశగా సాగిపోతోంది. శ్రీలంకతో లీగ్ పోరులో 204 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు 30 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 159 పరుగులు చేశారు. సీనియర్ బ్యాట్స్ మన్ ఆమ్లా, కెప్టెన్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీలు చేసి జట్టును గెలుపుబాటలో నిలిపారు. ప్రస్తుతం ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్ చెరో 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్రీజులో ఉన్నారు. విజయం కోసం ఇంకా 20 ఓవర్లలో 45 పరుగులు చేయాలి.

More Telugu News